Thursday, July 22, 2010

ప్రతి మరణం లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది





నా మిత్రుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు అయిన ఆకెళ్ళ రాఘవేంద్ర తన పుస్తకం మొదట్లో రాసిన కథ. బహుశా  ఈ కథ చాలా మందికి తెల్సే ఉంటుంది. ఒక రాజు కొడుక్కు ఫలానా తేదీన 5 గంటలకు మరణ గండం ఉంది అది కూడా పంది వల్ల అని ఆస్థాన జ్యోతిష్కుడు చెబుతాడు. రాజు రొటీన్ గానే అయన్ని బంధిస్తాడు. ఆ ఫలానా రోజు రానే వస్తుంది. ఓ పదో ఇరవయ్యో అంతస్థుల ఒంటి స్థంభం మేడ మీద రాజు తన కొడుకును పెట్టి మొత్తం సైన్యాన్ని కాపలాగా మొహరిస్తాడు. 4.30 అవుతుంది యువరాజు సేఫ్ అలా సమయం గడుస్తూ ఉంటుంది 4.59 అవుతుంది... 5 గంటలు అవుతుంది. రాజు, యువరాజును చూడటానికి గదిలోకి వెళ్తాడు. అక్కడ యువరాజు లేడు. కంగారుతో అంతటా వెతుకుతారు. చివరగా పై అంతస్థుకు వెళ్ళి చూస్తే అక్కడ రక్తపు మడుగులో యువరాజు కనిపిస్తాడు. వాళ్ళ రాజ చిహ్నం అయిన పంది ప్రతిరూపాన్ని శిలగా ఉంచారు. అది విరిగి మీద పడి యువరాజు చనిపోయివుంటాడు. గుర్తున్నంతవరకు రాశాను, బహుశా తేడాలు ఉండొచ్చు కానీ కథ కాన్సెప్టు కరెక్టే.   


దీన్నుంచి గ్రహించాల్సింది... నువ్వు ఎప్పుడు ఏ క్షణంలో ఎలా పోతావో తెలీదు. అందుకే నీ జీవితంలో ఏవైనా మంచి పనులు చేయాలని ఉంటే ఎప్పుడూ వాయిదా వేయకు అని రాఘవేంద్ర చెప్తాడు. వీలైనంత త్వరగా చేసెయ్యాలి. మామూలుగా కూడా ఎప్పుడైనా అంత్య క్రియలకు  వెళ్తే అంతో ఇంతో వైరాగ్యం మామూలే. రాఘవేంద్ర మాటలు విన్నప్పట్నుంచి  నా మైండ్ సెట్ కూడా అలాగే మారింది. త్వరగా పనులు కానీయాలి అని అంతరాత్మ హెచ్చరిస్తూ ఉంటుంది. లక్ష్యం వైపు మరింత ముందుకు జరిగామని తప్పకుండా అనిపిస్తూ ఉంటుంది. t

2 comments:

  1. మరీ తెలుగు మర్చిపోతున్నారేంటండీ సారూ !


    గుర్తు చేస్తుంది. గుర్తుకు తెస్తుంది.



    ఈ రెంటిలో ఏదో ఒకటి మాత్రమే కరెక్టు.

    ReplyDelete
  2. అఙ్ఞాత గారూ ధన్యవాదాలు

    ReplyDelete